యాప్నగరం

వాపును చూసి బలుపు అనుకుంటున్న చంద్రబాబు: ఎంపీ మోపిదేవి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 27 Mar 2023, 12:56 am
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటేనని ఎద్దేవా చేశారు.
Samayam Telugu మోపిదేవి వెంకట రమణ (ఫైల్ ఫొటో)


వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా రాయితీపై ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఫైరయ్యారు. పిల్లనిచ్చిన మామ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వరకు చంద్రబాబుది ఇదే పద్ధతి అని అన్నారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయమని మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.