యాప్నగరం

అమరావతి: రైతు కాలును తొక్కుకుంటూ వెళ్లిన వైసీపీ ఎంపీ కాన్వాయ్ కారు

అమరావతిలో రైతు కాలుపై నుంచి దూసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ కారు. రైతు కాలికి తీవ్రగాయం. ఎంపీ కనీసం పరామర్శించకుండా వెళ్లిపోయారని మండిపడుతున్న రైతులు.

Samayam Telugu 23 Feb 2020, 5:46 pm
అమరావతి రైతుల ఆందోళనలో అపశ్రుతి దొర్లింది. అమరలింగేశ్వరునికి మొక్కులు చెల్లించుకునేందుకు వెళుతున్న రైతుపైకి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి రథోత్సవం ఉండటంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఎంపీ నందిగం సురేష్ కూడా బయల్దేరి వెళుతున్నారు.
Samayam Telugu gnt.


ప్రజా ప్రతినిధులతో పాటూ వెలగపూడి, తుళ్ళూరు నుంచి కొంతమంది రైతులు, మహిళలు మొక్కులు చెల్లించుకునేందుకు, రథోత్సవంలో పాల్గొనేందుకు బయల్దేరారు. ఆలయానికి కొద్ది దూరంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు.. ట్రాఫిక్ ఉండటంతో నడిచి వెళ్లాలని చెప్పారు. దీంతో వారు ర్యాలీగా ఆలయంవైపుగా కదిలారు.
ఇంతలో ఎంపీ సురేష్ కారు అటువైపుగా వచ్చింది. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో.. ఆ బస్సును తప్పించే క్రమంలో సురేష్ కాన్వాయ్‌లోని వాహనం రైతు కాలుపైకి ఎక్కింది. ఆయన కాలికి గాయం కావడంతో అక్కడే ఉన్న తోటి రైతులు అతడ్ని హుటాహుటిన ఆలయానికి తరలించారు. ఎంపీ రైతుకు గాయమైనా కారు ఆపకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. కారు కాలిపై ఎక్కడంతో ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.