యాప్నగరం

మాజీ ఎంపీని కలిసిన ఎంపీ బోస్.. ఆసక్తికరంగా మారిన ఇద్దరి భేటీ, వైసీపీలో చేరతారా?

Mp Pilli Subhash Chandra Bose మాజీ ఎంపీ హర్షకుమార్‌ను కలిశారు. ఈ ఇద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. హర్షకుమార్ ఇంటికి ఎంపీ బోస్ వెళ్లారు. దీంతో మాజీ ఎంపీ వైఎస్సార్‌సీపీలో చేరతారానే ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవిని తిరస్కరించిన హర్షకుమార్. కొద్ది రోజులకే వైఎస్సార్‌సీపీ ఎంపీతో సమావేవం కావడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే హర్షకుమార్‌తో భేటీపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. ఆయన ఏమన్నారంటే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 Dec 2022, 5:56 am

ప్రధానాంశాలు:

  • మాజీ ఎంపీతో వైసీపీ ఎంపీ బోస్ సమావేశం
  • ఇద్దరు నేతలు ఏం చర్చించారనే ఉత్కంఠ
  • వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gv Harsha Kumar
ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎంపీ భేటీ ఆసక్తికరంగా మారింది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌(Gv Harsha Kumar)ను ఆయన నివాసంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (Pilli Subhash Chandra Bose) సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఎంపీ బోస్‌ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో ఈ ఇద్దరి భేటీ చర్చనీయాంశమైంది. హర్షకుమార్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారనే ప్రచారం జరిగింది. అయితే బంధువుల సమస్యకు సంబంధించి పాత మిత్రుడు హర్షకుమార్‌ను కలిసినట్లు ఎంపీ బోస్ క్లారిటీ ఇచ్చారట.
ఇటీవల కొత్తగా ఏపీ కాంగ్రెస్ కమిటీలో తనకు ఇచ్చిన పదవిని హర్షకుమార్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు. అప్పటి నుంచి హర్షకుమార్ కాస్త స్పీడ్ తగ్గించారు.. దీంతో పార్టీ మారవచ్చనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో బోస్‌ కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ భేటీపై హర్షకుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే ఆయన వైఎస్సార్‌సీపీలో చేరతారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల కాంగ్రెస్ కొత్త కమిటీల ఏర్పాటుపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు ఇచ్చిన క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ పదవిని వద్దని.. తాను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగానే కొనసాగుతాను అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవి కూడా అగ్ర కులాలకే ఇచ్చారన్నారు.

మొదటి నుంచి జీవీ హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గతంలో NSUI, యూత్ కాంగ్రెస్‌తో పాటూ మరికొన్ని విభాగాల్లో పదవుల్లో పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.. ఆ తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరు. 2019 ఎన్నికలకు ముందు హర్షకుమార్ టీడీపీలో చేరారు.. ఆయనకు అమలాపురం టికెట్ వస్తుందని భావించారు. కానీ టీడీపీ టికెట్ ఇవ్వలేదు.. మళ్లీ టీడీపీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి హర్షకుమార్ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతారా.. లేక రూట్ మార్చి వైఎస్సార్‌సీపీలోకి వెళతారా అన్నది చూడాలి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.