యాప్నగరం

మోదీ వల్లే నాకు పదవి.. మా పార్టీలో అన్నీ ఆ కులం వారికే.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైసీపీలో కుల రాజకీయాలను టార్గెట్ చేశారు.

Samayam Telugu 15 Jun 2020, 6:18 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీ కృష్ణంరాజు ఓ వీడియో విడుదల చేశారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ కులాల మధ్య చిచ్చుపెడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ చిన్న కులంలో చిచ్చుపెట్టొదంటూ వ్యాఖ్యానించారు. వైసీపీలో పదవులన్నీ సీఎం జగన్ చుట్టూ ఉండే కోటరీకి చెందిన కులస్తులకే దక్కుతాయన్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. సీఎం జగన్ దయ వల్లే పార్లమెంటు కమిటీకి చైర్మన్ పదవి దక్కిందని వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తానకు సీఎం జగన్ వల్ల ఆ పదవి దక్కలేదని స్పష్టం చేశారు.
Samayam Telugu రఘురామ కృష్ణంరాజు


పార్లమెంటులో మనకు ఉన్న ఎంపీలను బట్టి కమిటీ పదవులు దక్కుతాయని ఎంపీ కృష్ణంరాజు చెప్పారు. పార్లమెంటులో 24 డిపార్ట్ మెంట్ కమిటీలు, 11 పార్లమెంటరీ లోక్ సభ కమిటీలు ఉన్నాయని, లెక్కల ప్రకారం చూసుకుంటే వైసీపీకి ఒక్కటే చైర్మన్ పదవి వస్తుందని పేర్కొన్నారు. ఆ పదవి తనకు ఇవ్వాలని సీఎం జగన్‌ను తాను కోరినట్లు వెల్లడించారు. అయితే యథాప్రకారం రాష్ట్రంలో అన్ని పదవుల్లో ఎవరున్నారో అందరికీ తెలుసునని, దాని ప్రకారమే సీఎం జగన్ బిజినెస్ రూల్స్‌ను అతిక్రమించి మరీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఎన్నో పదవులతో పాటు పార్లమెంటరీ కామర్స్ కమిటీకి చైర్మన్‌గా నియమించారని వెల్లడించారు.

ఇక పార్లమెంటులో తనకు ఉన్న పర్ఫామెన్స్‌ను బట్టి.. మా లోక్‌సభ స్పీకర్, మా పార్లమెంటరీ ఎఫైర్స్ మినిస్టర్, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ కలిసీ మా పార్టీ కోటా అయిపోయినప్పటికీ.. వేరే వాళ్లకు చెందాల్సిన దాంట్లో నాకు పదవి ఇచ్చారని ఎంపీ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మా పార్టీకే రెండో ఇచ్చారని మీరు అనుకోవచ్చని, మా ప్రసాదరాజు కూడా ఇలాగే అనుకుని జగన్ దయ వల్ల వచ్చిందని అనుకోవచ్చని ఎద్దేవా చేశారు. దీన్ని ప్రజలు కూడా అదే నిజమని అనుకుంటారని భావించి ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నానని పేర్కొన్నారు. చివరిగా మా చిన్న కులంలో చిచ్చు పెట్టి, సం‘కుల’ రాజకీయం చేయవద్దని సీఎం కోటరీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు.

Must Read: కాళ్లావేళ్లా పడితే వైసీపీలోకి వచ్చా.. ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.