యాప్నగరం

AP Capital: జగన్‌కు రఘురామ మరో షాక్... రాజధాని అంశంపై ఇరుకున పెట్టేలా యాక్షన్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్రానికి లేఖ రాశారు. మూడు రాజధానులుగా మార్చే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంటుకే ఉంటుందని అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Samayam Telugu 19 Jul 2021, 8:05 am

ప్రధానాంశాలు:

  • ఆ అధికారం మీకే ఉంది
  • ఏపీ ప్రభుత్వం దుందుడుకు చర్యలు ఆపండి
  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మూడు రాజధానులుగా మార్చే అధికారం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంటుకే ఉంటుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజధాని మార్పు, రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాలతో పాటు ఇతర వసతుల కల్పనకు కేంద్రమే ఆర్థికసాయం చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
Also Read: అబ్బు రపరిచే ఆషాఢం సారె.. టన్ను చేపలు.. 50 రకాల స్వీట్లు, 200 ఆవకాయ జాడీలు.. గోదారోళ్లా మజాకా

అమరావతిలో రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, వసతుల కల్పనకు కేంద్రం సాయం చేసిందని, మొత్తంగా అమరావతిలో రూ.50 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టారని రఘరామ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని, భవిష్యత్తులో అది మెరుగయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న మెజారిటీతో కేంద్ర చట్టాన్ని మార్చగలనని అనుకుంటోందని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతి రాష్ట్రం కేంద్ర చట్టాలను ఉల్లంఘించి తమ సొంత చట్టాలు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Also Read: నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్

రాజధానుల మార్పుపై హైకోర్టు యథాతథ స్థితి ఆదేశాలు జారీచేసిందని, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని, అయినా మూడు రాజధానులపై రాష్ట్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారంటూ అమిత్‌ షా దృష్టికి రఘురామ తీసుకెళ్లారు. సమాఖ్య సూత్రాలకు లోబడి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, పునర్విభజన చట్టానికి సవరణలు చేసేవరకు ఎలాంటి కదలిక లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అమిత్ షాను కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.