యాప్నగరం

YSRCP: రాజుగారి విందు వేదిక మారింది.. జగన్‌ను నొప్పించకుండా.. ఆయనకు చెక్ పెట్టే యోచన?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఎంపీలకు విందు ఏర్పాటు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఎంపీలకు ఆయన విందు ఇస్తున్నారు. పార్లమెంట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ హోదాలో డిసెంబర్ 11న విందు ఇస్తోన్న ఆయన.. వేదికను మాత్రం మార్చారు. రఘురామ కృష్ణంరాజుకు ఢిల్లీలో ఇప్పటి వరకూ బంగళా కేటాయించలేదు. దీంతో తన వియ్యంకుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఇంట్లో విందు ఇస్తున్నట్టు గతంలో ఆయన తెలిపారు.

Samayam Telugu 10 Dec 2019, 5:00 pm
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఎంపీలకు విందు ఏర్పాటు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఎంపీలకు ఆయన విందు ఇస్తున్నారు. పార్లమెంట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ హోదాలో డిసెంబర్ 11న విందు ఇస్తోన్న ఆయన.. వేదికను మాత్రం మార్చారు. రఘురామ కృష్ణంరాజుకు ఢిల్లీలో ఇప్పటి వరకూ బంగళా కేటాయించలేదు. దీంతో తన వియ్యంకుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఇంట్లో విందు ఇస్తున్నట్టు గతంలో ఆయన తెలిపారు.
Samayam Telugu ysrcp mp raghu rama krishnam raju dinner party venue changed in the last minute
YSRCP: రాజుగారి విందు వేదిక మారింది.. జగన్‌ను నొప్పించకుండా.. ఆయనకు చెక్ పెట్టే యోచన?


లాన్స్ ఆఫ్ వెస్ట్రన్ కోర్టులో..

కానీ విందు వేదికను మారుస్తూ నర్సాపురం ఎంపీ నిర్ణయం తీసుకున్నారు. జన్‌పథ్‌లో ఉన్న లాన్స్ ఆఫ్ వెస్ట్రన్ కోర్టులో రాత్రి 8 గంటల నుంచి విందు ఇస్తున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. కేవీపీ రామచంద్రరావు నివాసంలో రాజుగారు విందు ఇస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించాయి. కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో.. అందులోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడైన కేవీపీ నివాసంలో ఆయన విందు ఇవ్వడం ఏంటనే ప్రశ్న తలెత్తింది. జగన్‌ను ఇబ్బంది పెట్టడం కోసం కేవీపీ సరికొత్త రాజకీయానికి తెర తీశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

కేవీపీ నివాసం నుంచి మార్పు..

జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత కూడా కేవీపీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆయన కలవలేదు. వైఎస్‌కు సన్నిహితుడైనప్పటికీ.. కేవీపీకి జగన్‌కు మధ్య దూరం ఉందని.. అందుకే ఆయన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారని గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో.. విందు వేదికను కేవీపీ నివాసం నుంచి మరో చోటుకి మార్చడం గమనార్హం.

జగన్‌కు ఇబ్బంది కావొద్దనేనా..?

ఈ విందు కోసం సీఎం జగన్‌, హోం మంత్రి అమిత్ షాలను కూడా నర్సాపురం ఎంపీ ఆహ్వానించారని తెలుస్తోంది. జగన్‌కు ఇబ్బందికరం కావొద్దనే ఉద్దేశంతోనే వేదికను మార్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సత్తా చాటడం కోసమా..?

ఇటీవలి కాలంలో బీజేపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్న రఘురామకృష్ణంరాజు.. విందు ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో తనకు ఏస్థాయిలో పరిచయం ఉన్నాయో చాటడం కోసం ఈ విందును ఓ అవకాశంగా ఆయన భావిస్తున్నారట. తమ పార్టీకే చెందిన ఓ నేత పెత్తనాన్ని సహించేది లేదని చెప్పడం కూడా ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.

విందు తర్వాత..

ఇప్పటికే బీజేపీ నేతలు రఘురామకృష్ణంరాజుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఆయన్ను స్వయంగా.. రాజుగారూ బాగున్నారా? అని పలకరించారు. వైఎస్సార్సీపీకి చెందిన మిగతా నేతల కంటే ఆయనకు ముందుగా అమిత్ షా అపాయింట్‌మెంట్ దక్కుతోంది. ఈ విందు తర్వాత ఢిల్లీలో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.