యాప్నగరం

సొంతపార్టీ వాళ్లపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

సొంత పార్టీ కార్యకర్తల నినాదాలతో చిన్నబుచ్చుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ. ఎవడి నాయకత్వం అంటూ చిందులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ రాజుగారి వీడియో.

Samayam Telugu 19 Mar 2020, 11:54 am
వైఎస్సార్‌సీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సొంత పార్టీ కార్యకర్తల ముందే.. బొ..లో నాయకత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో స్థానికంగా చిన్న వివాదం రేగింది. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరగా.. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎంపీనే కార్యకర్తలకు చెబుతుండగా.. కొందరు జై జగన్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

ఈ నినాదాలతో రఘురామకృష్ణం రాజు కాస్త నొచ్చుకున్నారు. అలాగే మరికొందరు కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయగా.. ఓ కార్యకర్త మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తన అసంతృప్తి వెంటనే బయటపెట్టారు. బొ..లో నాయకత్వం.. ఎవడి నాయకత్వం కావాలి.. నోరు మూసుకుని కూర్చో అంటూ ఘాటుగా ఫైరయ్యారు. ఎంపీ తిట్టడంతో కార్యకర్తలు ఒకింత షాకయ్యారు.. అంతా సైలెంట్ అయిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రఘురామకృష్ణం రాజు గతంలో కూడా ప్రోటోకాల్ వివాదం, ప్రధాని మోదీని కలవడం ఇలా వరుసగా వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలకు విందు ఇచ్చిన సమయంలోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు ఎంపీ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. సొంత పార్టీలో కూడా చర్చనీయాంశం అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.