యాప్నగరం

వైఎస్ఆర్ జయంతిపై వైసీపీ ఎంపీ రఘురామ ప్రకటన

వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామ ప్రకటన విడుదల చేయనున్నారు. వైఎస్ చేసిన పాదయాత్ర వలన మనోరంజకంగా పరిపాలన చేయగలిగారన్నారు.

Samayam Telugu 8 Jul 2020, 10:52 am
ఇవాళ దివంగత నేత వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులంతా వైఎస్ఆర్‌కు ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వైఎస్ఆర్ జయంతిపై ఒక ప్రకటనను విడుదల చేశారు. మనసున్న మారాజు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు ఎంపీ. ఆయన చేసిన పాదయాత్ర వలన మనోరంజకంగా పరిపాలన చేయగలిగారన్నారు. ఆయన చేపట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయన్నారు. జలయజ్ఞంతో వృథా జలాల వినియోగానికి శ్రీకారం చుట్టారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో నిత్యం మమేకమై, అందరికీ నేనున్నాననే భరోసా కల్పించారని వైఎస్ఆర్‌ను ఉద్దేశించి రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
Samayam Telugu వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు
ysrcp mp raghu rama krishnam raju


మరోవైపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. నా బిడ్డల మాదిరిగా ఆయన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు తెలుసుకుని ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నాని తెలిపారు. సహృదయంతో ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నా’అని విజయమ్మ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.