యాప్నగరం

జగన్ సర్కార్‌కి థ్యాంక్స్.. ఇప్పటికైనా.! రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పది, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలంటూ జగన్ సర్కార్‌పై సెటైర్లు వేశారు.

Samayam Telugu 24 Jun 2021, 10:43 pm
జగన్ సర్కార్‌పై లేఖల బాణాలు సంధిస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘు రామకృష్ణ రాజు మరోమారు ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది ప్రజావిజయమని రఘురామ అన్నారు. పరీక్షలు రద్దు చేయడంపై ఆయన అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు అభినందనలు తెలిపారు. సరైన సమయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే జగన్ సర్కార్‌పై సెటైర్లు వేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ragurama


ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసిందని చెబుతూ ప్రభుత్వానికి రఘురామ ధన్యవాదాలు చెప్పారు. సుప్రీం కోర్టు జోక్యంతో పరీక్షలు రద్దు చేసిందని.. ఇప్పటికైనా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన జగన్ సర్కార్‌కి చురకలంటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సరైన ప్రణాళిక లేకుండా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల కోసం సరైన ఏర్పాట్లు చేయకుండా పరీక్షల నిర్వహణ ఎలా చేస్తారని ప్రశ్నించింది. వచ్చే నెల 31 లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.