యాప్నగరం

‘అంచు డాబే కానీ.. పంచె డాబు లేదు’.. జగన్ సర్కార్‌పై వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

జగన్ సర్కార్‌పై మరోమారు విరుచుకుపడ్డారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ. నవ సూచనల పేరుతో రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను ప్రస్తావించారు. ఇసుక పాలసీ మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.

Samayam Telugu 5 Jul 2021, 1:59 pm
వైసీపీ ఎంపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు నవ సూచనల పేరుతో మరోమారు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఇసుక విధానాన్ని తూర్పారబట్టారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానమంటూ దోచుకుతింటోందని విమర్శించి అధికారంలోకి వచ్చిన మనం.. నూతన పాలసీని రూపొందించడంలో ఘోరం విఫలమయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. ఇసుక తవ్వకాలను తీసుకెళ్లి జేపీ వెంచర్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారని.. అదేమో అన్నీ రీచ్‌లలో కనీసం తవ్వకాలను కూడా ప్రారంభించే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
jagan


ఇసుక కొరత నిర్మాణ రంగం కుదేలైపోయిందని.. ఐరన్, సిమెంట్ వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని రఘురామ అన్నారు. ఇసుక తక్కువ ధరకు అందించడమేమో కానీ.. నూతన ఇసుక విధానాలతో ప్రజలు విసిగిపోయారని రఘురామ అన్నారు. ఇప్పటికే ప్రజలు ప్రభుత్వానికి అంచు డాబే కానీ పంచె డాబు కాదని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగ కార్మికులు గగ్గోలు పెడుతున్నారని రఘురామ అన్నారు.

జగనన్న ఇళ్ల కాలనీల అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన వారికి ఇసుక సరఫరా చేస్తారని అంటున్నారని రఘురామ ఆరోపించారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణానికి 37 లక్షల టన్నుల ఇసుక అవసరం అవుతోందని అంచనా వేశారు. వీటికి తోడు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మరింకెంత కావాలో ఒక్క సారి అంచనా వేసుకోవచ్చు. ఈ సాధారణ లెక్కలను కూడా మన ప్రభుత్వం ఆలోచించడం లేదనిపిస్తోందని విమర్శించారు. తక్షణమే మీ ప్రియమైన ఇసుక పాలసీని ఇప్పటికైనా మార్చుకోండంటూ సెటైర్లు వేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.