యాప్నగరం

సీఎం జగన్ మాటల్నే ఫాలో అవుతున్నా, వాళ్లే మాటతప్పి.. ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 12 Jul 2021, 9:05 pm
నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. అమరావతిపై తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో సోమవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రఘురామ.. తాను అమరావతికే మద్దతిస్తానని తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కూడా ఇదే మాట చెప్పారన్నారు.
Samayam Telugu రఘురామ కృష్ణంరాజు


తాను కూడా ఎన్నికల ప్రచారంలో ఇదే మాట చెప్పానని రఘురామ గుర్తు చేశారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే ఇళ్లు కట్టుకున్నారంటూ.. ఇక్కడే ఉంటారంటూ ప్రచారంలో చెప్పానన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ సిద్ధాంతానికే తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. అయితే, తమ నాయకులు మాత్రం మాటలు, మడమలు తిప్పేశారని ఎద్దేవా చేశారు. తాను మాత్రం అమరాతికే కట్టుబడి ఉన్నానని తేల్చిచెప్పారు.

ఇక, జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.