యాప్నగరం

సీఎం జగన్‌కు నేనేంటే అసహ్యం.. 20 రోజుల్లో నాపై బహిష్కరణ.. ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Sep 2020, 8:00 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను మరో 20 రోజుల్లో, లేక నెల రోజుల్లో కచ్చితంగా బహిష్కరిస్తుందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. తనను ఇప్పటికే అధికారికంగా వైసీపీ నుంచి వెలివేశారన్నారు. అయితే తన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఎంపీ రఘురామ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానంటే ముఖ్యమంత్రి జగన్‌కు ఎలర్జీ అని, అసహ్యమని వ్యాఖ్యానించారు. అయినా కూడా రఘురామ చెప్పిన మాటలను సీఎం జగన్ వింటున్నారని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కాబట్టే ప్రజలు తమ వారధిగా భావించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
Samayam Telugu రఘురామ కృష్ణరాజు, సీఎం జగన్


తనను ముఖ్యమంత్రి జగన్ పక్కనపెట్టినప్పటికీ.. ఒక ప్రజాప్రతినిధిగా తన విధిని నిర్వర్తిస్తున్నానని ఎంపీ రఘురామ అన్నారు. తనకు ఇంతటి స్థాయిని ఇచ్చింది జగనేనని, ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. తాను ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొవడానికి కారణమైన సీఎం జగన్ను మనసులో పెట్టుకుంటానని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక, టీటీడీ వివాదంపై ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాసిందేనని.. ఒకరి కోసం టీటీడీ పద్దతులను మార్చడం సరికాదన్నారు. ఏపీలో ఆలయాలపై, హిందూ మతంపై దాడులకు నిరసనగా నల్ల రిబ్బన్‌ ధరించి ఇకపై పార్లమెంట్‌కు హాజరవుతానని ఆయన వెల్లడించారు. దాడులపై సీబీఐ విచారణ అడిగితే వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారని చెప్పారు. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్‌ తప్పనిసరి అని మరోసారి రఘురామ డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం టీటీడీ చైర్మన్‌కు లేదని.. సీఎం జగన్‌ కూడా తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేశారు. ఏపీలో రైతు భరోసా కాస్తా రైతు గాబరాగా మారిందని సెటైర్లు వేశారు. తనను వైసీపీ నుంచి వెలివేసినా ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.