యాప్నగరం

అమరావతి రైతుల ఆందోళనల్లో తప్పేముంది.. వైసీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి రైతుల నిరసనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. రైతుల ఆందోళనల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్న ఎంపీ.. రాజధానిపై ఇంకా నిర్ణయం రాలేదన్న కృష్ణంరాజు.

Samayam Telugu 24 Dec 2019, 3:20 pm
అమరావతి రైతుల ఆందోళనలు, నిరసనలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రైతుల ఆందోళనలో తప్పు పట్టడం సరికాదని.. రాజధాని మార్పుపై వారిలో ఆందోళన సహజమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం, సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో తాజా పరిణామాలపై స్పందించారు.
Samayam Telugu ram


రాజధానిపై ఎలాంటి నిర్ణయం రాకుండానే రైతులు ఆందోళన పడొద్దని.. కేబినెట్‌, అసెంబ్లీ ఆమోదం తర్వాతే నిర్ణయం వస్తుందన్నారు. అదే సందర్భంలో రాజధానిని పూర్తిగా తరలించడం లేదని.. అమరావతితో పాటూ విశాఖ కూడా రాజధాని ఉంటుందన్నారు. రాష్ట్రంలో వికేంద్రీకరణ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని.. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది.. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు.

ఇక సంక్రాంతి సమయంలో నిర్వహించే కోడి పందాలపైనా రఘురామకృష్ణంరాజు స్పందించారు. జూదానికి, హింసకు అవకాశం లేకుండా.. కోడిపందాలు కచ్చితంగా జరుగుతాయని వ్యాఖ్యానించారు. సంక్రాంతి పండగలో కోడిపందాలు ఓ భాగమని.. మన సంస్కృతీ, సంప్రదాయలలో భాగమని గుర్తు చేశారు. ఉభయగోదవారి జిల్లాల్లో కోడిపందాల నుంచి ప్రజల్ని ఎవరూ విడదీయలేరని.. ఒకవేళ ఎవరైనా విడదీయాలని చూస్తే వారి ఆలోచనలు దెబ్బతింటాయన్నారు ఎంపీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.