యాప్నగరం

జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ.. ఈసారి మరో విన్నపం

ఇప్పటికే జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వరుస లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన లేఖ రాశారు. సీఎంకు ఇలా రఘురామ వరుస లేఖలు రాయడం వైసీపీలో ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu 19 Jul 2020, 11:13 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన జగన్‌కు మరో లేఖ రాశారు. ఈ సారి లేఖలో రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోశాలల ఏర్పాటు కమిటీకి జీవో ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఆ గోశాలల కమిటీలు ఏర్పాటు కాలేదని చెప్పారు.
Samayam Telugu వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు
ysrcp mp raghurama krishnam raju


గత ఏడాది సింహాచలంలో మూడు ఆవులు చనిపోయాయని, ఆర్థిక ఇబ్బందులు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రఘురామకృష్ణరాజు సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు. తాడేపల్లి గోశాలలో విష ప్రయోగం వల్ల వంద ఆవులు మృతి చెందాయన్న విషయాన్ని కూడా లేఖలో ఎంపీ రఘరామ పేర్కొన్నారు. అన్ని వర్గాలతో కలిపి గోశాలల అభివృద్ధికి కమిటీలు వేయాలని ఆయన సూచించారు. ఆవులు, దూడల సంరక్షణ అంశం హిందువుల నమ్మకానికి సంబంధించిందన్నారు వైసీపీ ఎంపీ.
Read More: ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ... ఏం కోరారంటే?
ఇటీవలే ఏపీలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని జగన్‌కు లేఖ రాశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారన్నారు. వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారన్నారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.