యాప్నగరం

BJP కృష్ణం రాజుతో వైసీపీ ఎంపీ కృష్ణంరాజు.. పక్కనే ప్రభాస్

సినీ నటుడు, బీజేపీ ఎంపీ కృష్ణం రాజుతో వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Samayam Telugu 26 Jan 2020, 4:59 pm
హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు బీజేపీ నేతలకు బర్త్ డే పార్టీ ఇచ్చారు. జనవరి 20న పుట్టిన రోజు జరుపుకొన్న ఆయన.. శనివారం బీజేపీ నేతలకు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. కృష్ణంరాజు ఇది వరకే సినీ ప్రముఖులకు కూడా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిరంజీవితో పాటు పలువురు సినీ నటులు హాజరయ్యారు.
Samayam Telugu krishnam raju raghurama raju


బీజేపీ నేతలకు కృష్ణంరాజు బర్త్ డే పార్టీ ఇచ్చిన రోజే.. వైఎస్సార్సీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా రెబల్ స్టార్‌ను కలిసినట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు, ప్రభాస్‌లతో వైఎస్సార్సీపీ ఎంపీ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నర్సాపురం ఎంపీ గతంలోనూ ప్రభాస్‌ను కలిశారు. వీరిద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతోపాటు ఒకే జిల్లా అనే సంగతి తెలిసిందే.

బీజేపీ నేతలతో రఘురామ కృష్ణం రాజు సన్నిహితంగా మెలుగుతున్నారని గత కొంత కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ప్రధాని మోదీ సైతం స్వయంగా ఆయన్ను పలకరించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమిత్ షా కూడా మిగతా వైఎస్సార్సీపీ నేతల కంటే ముందుగా రఘురామ రాజును కలిశారు. అంతేకాకుండా.. ఆయన ఢిల్లీలో సహచర ఎంపీలకు భారీ స్థాయిలో విందు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.