యాప్నగరం

విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని.. విజయసాయిరెడ్డి ఎన్ని దొంగ రాతలు రాయించినా తాను పార్టీకి విధేయుడ్ని అన్నారు. విజయసాయిరెడ్డి చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారని.. షోకాజ్ నోటీసులు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

Samayam Telugu 27 Jun 2020, 1:25 pm
ఢిల్లీలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డితో సమావేశమైన రఘురామకృష్ణంరాజు.. భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని ఓ భక్తుడిగా విభేదించానని.. పార్టీ నిర్ణయాన్ని విభేదించినట్లు చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కాబట్టి రక్షణ కోరానని.. ఆ వివరాలను తెలుసుకోవడానికే కిషన్‌రెడ్డిని కలిశానన్నారు.. ఇక రాజ్‌నాథ్ సింగ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానన్నారు. ఈసీని విధివిధానాల గురించి తెలుసుకోవడానికి కలిసినట్లు చెప్పారు.
Samayam Telugu రఘురామకృష్ణంరాజు


తనకు షోకాజ్ నోటీసులపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై ఆలోచిస్తున్నాను అన్నారు రఘురామ. తాను పార్టీ అధ్యక్షుడిని దుర్భాషలేదని.. వాళ్లే వార్తలు రాయించి షోకాజ్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని.. విజయసాయిరెడ్డి ఎన్ని దొంగ రాతలు రాయించినా తాను పార్టీకి విధేయుడ్ని అన్నారు. విజయసాయిరెడ్డి చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారని.. షోకాజ్ నోటీసులు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ బిజీగా ఉన్నారని చెబుతున్నారని.. అపాయింట్‌మెంట్ దొరికితే కలుస్తాను అంటున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ను కలుస్తున్నారని.. తన కోటా ఎప్పుడొస్తుందో తెలియదన్నారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఆయనకు మెయిల్‌లో వివరణ ఇస్తాను అంటున్నారు. తనకు రక్షణ కల్పించిన తర్వాతే తాను నియోజకవర్గానికి వెళతానని.. తనకు రక్షణ కల్పిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.