యాప్నగరం

యనమల.. మీ బాస్, కొడుకుతో జైల్లో ములఖాత్‌కు సిద్ధమవ్వు: విజయసాయి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై మాజీ మంత్రి యనమల ఘాటు వ్యాఖ్యలు. ట్విట్టర్‌లో కౌంటరిచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. యనమలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు, లోకేష్‌లపైనా ఘాటు వ్యాఖ్యలు.

Samayam Telugu 2 Aug 2019, 2:56 pm
టీడీపీపై ట్వీట్ల దాడిని పెంచారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రోజుకో అంశంతో చంద్రబాబుతో పాటూ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు విజయసాయి కౌంటరిచ్చారు. అలాగే అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు.
Samayam Telugu visa.


‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో బాబు పార్ట్‌నర్‌ యనమల విలువల గురించి గురివిందలా మాట్లాడుతున్నారు. చిదంబరాన్ని అర్థరాత్రి కాళ్లు పట్టుకుని జగన్‌ గారిపైన కేసులు పెట్టించింది నీబాసే కదా? రేపు మీ నాయకుడు, ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో? ములాఖత్‌లో కలుద్దురు. సిద్ధంగా ఉండండి’అన్నారు విజయసాయి.
‘ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కాం జరిగింది. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారు. రెండు లక్షలతో నిర్మించే క్యాంటీన్‌కు 30-50 లక్షలు ఖర్చయిందని లెక్కలు చూపారు’అంటూ టీడీపీ విమర్శలకు కౌంటరిచ్చారు.
‘5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్టులో అందినకాడికి దోచుకుందామని చూశారే తప్ప పూర్తి చేద్దామన్న చిత్తశుద్ధి చంద్రబాబు ఏనాడూ చూపలేదు. ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే సగం రాష్ట్రం జలసిరితో సస్యశ్యామలమయ్యేది. రోజుకు 60 టిఎంసీల నీరు వృథాగా సముద్రం పాలయ్యేది కాదు’అంటూ పోలవరంపై చంద్రబాబు ట్వీట్‌లకు సమాధనం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.