యాప్నగరం

'Chandrababu Naidu మానసిక స్థితిపై టీడీపీ నేతల్లో ఆందోళన'

TDP| 'నిరాశ, నిస్పృహ, ఎప్పటికీ అధికారం దక్కదనే భీతి కుంగ తీస్తోంది. తన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటాడు. వెంటనే సిఎం గారినే జైలుకు పంపిస్తా అని బెదిరిస్తాడు'

Samayam Telugu 16 Oct 2019, 1:51 pm
టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. చంద్రబాబులో నిరాశ, నిస్పృహ, ఎప్పటికీ అధికారం దక్కదనే భీతి ఆయనను కుంగదీస్తోందని.. అందుకే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని సెటైర్లు పేల్చారు. ఇక తెలుగు తమ్ముళ్లు సొల్లు వాగుడుతో ప్రభుత్వంపై బురదజల్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu babu


Read Also: నారా లోకేష్ టంగ్ స్లిప్.. సోషల్ మీడియాలో ట్రోల్స్

‘చంద్రబాబు మానసిక స్థితిపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. నిరాశ, నిస్పృహ, ఎప్పటికీ అధికారం దక్కదనే భీతి ఆయనను కుంగదీస్తున్నాయి. తన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటాడు. వెంటనే సిఎం గారినే జైలుకు పంపిస్తా అని బెదిరిస్తాడు’అంటూ సెటైర్లు పేల్చారు.
‘గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న ఉత్సాహంలో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు. వైఎస్ రైతు భరోసాలో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం ఉంది. ఈయనేమో పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని ఏడుపు రాగాలు తీస్తుంటే క్షేత్ర స్థాయిలో తుపుక్కుమని ఊస్తున్నారు చంద్రబాబు’అన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే చంద్రబాబు, ఆయన మోచేతులు నాకే బ్యాచికి గుండె దడ పెరిగి పోయింది. మడమ తిప్పాడని కొందరు, నాలుగు నెల్లకే ఢీలా పడ్డాడని మరి కొందరు సొల్లు వాగుడు వాగుతున్నారు. దొంగలకు చీకటి అంటేనే ఇష్టం. వెలుతురంటే భయం’అంటూ విమర్శించారు విజయసాయిరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.