యాప్నగరం

'ఆయన భజనా చౌదరి.. మీడియాతో కాదు వాళ్లతో ప్రెస్‌మీట్ పెట్టాలి'

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సుజనా చౌదరి విలేకర్ల బదులు వేల కోట్ల మేర ముంచేసిన బ్యాంకు అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే బావుంటుందన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ.

Samayam Telugu 22 Nov 2019, 12:10 pm
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి టీడీపీ, వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేశారు. తమతో ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారంటూ పెద్ద బాంబ్ పేల్చారు. ఇప్పటికప్పుడు వారిని పార్టీలో చేర్చుకోమని.. అవసరం వచ్చిన సమయంలో తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.. సుజనా చౌదరికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
Samayam Telugu sujana


నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపి) వేరు.. అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అన్నారు విజయసాయి. ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని.. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే.. ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఎందుకు మార్చాడో అన్నీ అర్ధమవుతాయి అంటూ సెటైర్లు పేల్చారు.
‘సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీలో వరస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు.. సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు నిన్న ప్రెస్ మీట్‌ను లైవ్ లో, లైవ్ స్ట్రీమింగ్ లో మోతేక్కించిందంటే... కారణం పబ్లిక్ ఇంటెరస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంటెరస్టా?’అంటూ ప్రశ్నించారు.
‘అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపి ప్రయోజనాల గురించి ప్రెస్ మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.