యాప్నగరం

'మంది పిల్లలపై నిందలా చంద్రబాబు.. మీ పుత్రరత్నం తాగి తందనాలాడలేదా?'

'ఎంతగా దిగజారి పోయారు చంద్రబాబు గారు.. మంది పిల్లలపై నిందలు వేస్తారా, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ పుత్రరత్నం విదేశీ అమ్మాయిలతో తాగి తందనాలాడిన ఫోటోలను ప్రజలంతా చూశారు'

Samayam Telugu 29 Sep 2019, 3:18 pm
టీడీపీపై విరుచుకుపడుతున్నారు వైఎస్సార్‌‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ సర్కార్‌పై చంద్రబాబు, లోకేష్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా బాబు గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. వాలంటీర్ల పేరు వినగానే బాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. లోకేష్‌ను టార్గెట్ చేస్తూ హాట్ ట్వీట్స్ చేశారు.
Samayam Telugu babu


Read Also: 'సీఎం గారు కరెంట్ లేదు.. తెలియకపోతే చంద్రబాబును అడగండి'

‘ఎంతగా దిగజారి పోయారు చంద్రబాబు గారు. వాలంటీర్ల పేరు వింటేనే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ పుత్రరత్నం విదేశీ అమ్మాయిలతో తాగి తందనాలాడిన ఫోటోలను ప్రజలంతా చూశారు. అతడినేమో దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. మంది పిల్లలపై నిందలు వేస్తారా? ’అంటూ మండిపడ్డారు
‘350 ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై చంద్రబాబు గారికి కడుపు మంట స్టార్ట్ అయింది. 9 సంస్థలు ముందు కొచ్చాయని ఆర్టీసి చెప్పింది. అక్టోబరు14న టెక్నికల్, నవంబరు 1న ఫైనాన్షియల్ బిడ్స్ వేయాల్సిఉంది. అప్పుడే 7500 కోట్ల క్విడ్ ప్రో కో జరిగిందని కల వచ్చిందట. ఇంత ఆవేశం మంచిది కాదు బాబూ’అన్నారు విజయసాయిరెడ్డి.
‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి పచ్చ దండుకు కంటిమీద కునుకు లేదు. సంస్థను దివాలా తీయించి జీతాలు చెల్లించలేని దుస్థితికి నెట్టిన వారు ఉచిత సలహాలిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల లీజు ప్రక్రియ పైన, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారని ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శిస్తున్నారు’అంటూ ఫైరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.