యాప్నగరం

'ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో ఆయనే ప్రధాన భాగస్వామి'

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఆయనే ప్రధాన భాగస్వామి. ఇప్పుడు ఆయన నీతి బోధనలు చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Samayam Telugu 16 Dec 2019, 11:45 am
టీడీపీపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ వార్ కొనసాగిస్తున్నారు. చంద్రబాబుతో పాటూ టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి యనమల ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో తన బంధవులకు పదవులు, కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని ఆరోపించారు.
Samayam Telugu ntr


యనమల గారు కూడా నీతి బోధలు చేస్తున్నారని.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన ప్రధాన భాగస్వామి అన్నారు విజయసాయిరెడ్డి. అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు, వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని.. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇటు పవన్ కళ్యాణ్‌ను కూడా విజయసాయి టార్గెట్ చేశారు. చంద్రబాబు, దత్త పుత్రుడిని భుజాలపై మోస్తున్న ఎల్లో మీడియాకు రాజా రవితేజ గారు చెబుతున్న ‘సెటిల్మెంట్ల’ రహస్యాలు వినిపించడం లేదన్నారు. తమ కోడి కూస్తేనే తెల్లారుతుందని భ్రమ పడుతోందింకా.. అరచేతులు అడ్డు పెట్టి ఎంత దాచినా సోషల్ మీడియా ఊరుకోదుగా? చీల్చి చెండాడుతోంది అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.