యాప్నగరం

'బాబు, పవన్ సేమ్ టూ సేమ్.. త్వరలోనే వైసీపీలోకి భారీగా చేరికలు'

పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబులా యూ టర్న్‌లు తీసుకుంటున్నారు. రాజధాని విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. చంద్రబాబు తీరుతో సొంత పార్టీ నేతలే విసుగు చెందారు.

Samayam Telugu 1 Sep 2019, 6:17 pm
రాజధాని అమరావతిలో వద్దని చెప్పిన పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ కూడా చంద్రబాబులాగే యూ టర్న్‌లు తీసుకోవడం అలవాటైపోయిందన్నారు. గతంలో అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని ఆయన చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వైసీపీలో చేరిక తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి.. తాజా పరిణామాలపై స్పందించారు.
Samayam Telugu pkl


Read Also: 'నేను మాయలో పడ్డానో లేదో కానీ.. పవన్ ఉన్నంత కాలం జగన్ ముఖ్యమంత్రి'

రాజధాని విషయంలో వ్యతిరేకత లేదని, స్పష్టత ఉందన్నారు.. ముంపు సమస్యల్ని పరిష్కరించే అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఇబ్బందులపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వైఎస్సార్‌సీపీలోకి త్వరలో భారీగా చేరికలు ఉంటాయన్నారు విజయసాయిరెడ్డి. ప్రజలు తిరస్కరించి, అధికారం కోల్పోయినా చంద్రబాబు పద్దతి మార్చుకోలేదన్నారు. బాబు తీరుతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారన్నారు.

ఇటు వైసీపీప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విమర్శలపైనా విజయసాయి ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. దేశ జీడీపీ 5% పడిపోవడానికి ఏపీలో 3 నెలల క్రితం ఏర్పడ్డ కొత్త ప్రభుత్వమే కారణమని చంద్రబాబు చెంచాల ఆరోపణ. పదేళ్ల తర్వాత జలాశయాలన్నీ నిండి రెండు పంటలకు నీరు అందుబాటులోకి వస్తే పచ్చ మేధావులకు కళ్లకు కనిపించట్లేదు. నరేంద్ర మోదీ గారిని అనే ధైర్యం లేకనే ఈ పిచ్చి మాటలు’అంటూ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.