యాప్నగరం

‘ఎన్ని పెళ్లిళైనా చేసుకోవచ్చని జనసైనికులకు సలహా ఇస్తున్నారా’

'మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి? ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.. నసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా నిత్యకళ్యాణం గారూ'

Samayam Telugu 13 Nov 2019, 11:08 am
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జగన్ సర్కార్-విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ సీఎం ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటరిస్తూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో పాటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యలను టార్గెట్ చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంపైనా ఏపీ సీఎం వ్యాఖ్యలు చేశారంటూ జనసేన ఆరోపించింది. అలాగే పవన్ కూడా జగన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.
Samayam Telugu vijaya sai.


Read Also: 'గుడులకు కూడా వైసీపీ రంగులా.. పిచ్చి పరాకాష్ట బాబోయ్'

తాజాగా పవన్ కళ్యాణ్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా నిత్యకళ్యాణం గారూ. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి? ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ప్యాకేజి స్టార్లు, వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరు. అతిగా ఊహించుకోకండి’అంటూ నిప్పులు చెరిగారు.
‘కొడుకేమో నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక రోజైనా భోజనానికి దూరం ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు’అంటూ చంద్రబాబు, లోకేష్‌లపై సెటైర్లు పేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.