యాప్నగరం

గంటాపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రజలు గంటాను గెలిపించారని.. ఆయన మాత్రం అందుబాటులో లేకుండా పోతున్నారు. గంటాను పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.. ఆయన్ను పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు.

Samayam Telugu 20 Apr 2020, 7:33 am
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గెలిచిన తర్వాత ప్రజలను మరిచిపోవడం గంటాకు అలవాటని.. ఒకసారి గెలిచిన చోట మరల ఎన్నికల్లో పోటీ చేయరని ఎద్దేవా చేశారు. ఆయన్ను వైఎస్సార్‌సీపీలో చేర్చుకునే పరిస్ధితి లేదన్నారు. గంటాను పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయని.. అవన్నీ అవాస్తవాలేనని.. ఆయనను పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదన్నారు.
Samayam Telugu ganta


విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓడిపోయినా కేకే రాజు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. ఈ నియోజకవర్గంలో ప్రజలు గంటాను గెలిపించారని.. ఆయన మాత్రం అందుబాటులో లేకుండా పోతున్నారని ఆరోపించారు. గెలిచిన గంటా శ్రీనివాసరావు ఎక్కడున్నారో తెలియదు.. అదే ఓడిపోయిన కేకే రాజు మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లే అవుట్‌లో నాయీ బ్రహ్మణులకు, కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం గంటా పార్టీ మారతారని ప్రచారం జరిగింది.. ఆయన వైఎస్సార్‌సీపీలోకి వెళతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.