యాప్నగరం

'చంద్రబాబు రాజధాని పర్యటన అందుకే'

Chandrababu Naidu| రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబు. టీడీపీ అధినేత టూర్‌పై వైఎస్సార్‌సీపీ కౌంటర్లు.. వాళ్ల కోసమే చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారన్న విజయసాయిరెడ్డి.

Samayam Telugu 28 Nov 2019, 1:52 pm
చంద్రబాబు రాజధాని పర్యటనతో పొలిటికల్ హీట్ పెరిగింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం మొదలయ్యింది. అమరావతిని జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తుంటే.. ఐదేళ్లు చంద్రబాబు రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బాబు పర్యటనపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాజధాని పేరుతో పెద్ద స్కామ్ చేశారని.. తన బంధువుల కోసమే అమరావతి పర్యటనకు వెళ్లారని ఆరోపించారు.
Samayam Telugu cbn


Read Also: Amaravati పర్యటనలో చంద్రబాబు భావోద్వేగం

చంద్రబాబును రాజధాని ప్రాంత రైతులు, కూలీలు నిలదీయాలన్నారు విజయసాయి. తమ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి ఎవరి కోసం పర్యటిస్తున్నాడో ప్రశ్నించాలి అన్నారు. రాజధాని భూసేకరణ ప్లాన్‌ను ముందే లీక్ చేసి తన బంధువర్గంతో వేలాది ఎకరాలు కొనిపించి దేశంలోనే అతి పెద్ద స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు వచ్చేది కూడా వాళ్ల కోసమే అన్నారు.

Also Read: అమరావతిలో బాబు పర్యటన.. హైవోల్టేజ్ నిరసనలు.. ఈస్థాయిలో వ్యతిరేకత ఎందుకు?
ఇక జనసేనన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా విజయసాయి మండిపడ్డారు. సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారని.. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతారు అన్నారు. పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా చిత్తుచిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే.. ప్యాకేజి కోసం వీధి ప్రదర్శనలిస్తున్నారు.. సానుభూతి చూపడం మినహా ఏం చేస్తాం అంటూ సెటైర్లు పేల్చారు.
See Photo Story:అమరావతికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.