యాప్నగరం

'చంద్రబాబుకు వాళ్లను చూస్తే కడుపు మంట.. కొడుక్కి మాత్రం'

Chandrababu Naidu| 'గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు మళ్లీ కడుపుమంట బయట పెట్టుకున్నాడు. నెలకు 200 కోట్లు ఖర్చు పెట్టి వలంటీర్లను నియమించడానికి ఎవడిచ్చాడు మీకు అధికారం అని గుడ్లురుముతున్నాడు. కొడుక్కి మాత్రమే ఉద్యోగం ఇచ్చి, ఐదు లక్షల కోట్లు దోచుకున్నోడు'

Samayam Telugu 11 Oct 2019, 3:28 pm
చంద్రబాబు, టీడీపీపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బాబు జగన్ సర్కార్‌పై చేసిన విమర్శలకు ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఇంకా సిగ్గు రాలేదని.. నాలుగు నెలలుగా అవే అబద్దాలు, అవే సొల్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లను చూస్తే చంద్రబాబుకు కడుపు మంట అన్నారు.
Samayam Telugu visa


Read Also: సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్.. ఇదేం అరాచకం

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎం, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్, మళ్లీ మూడోసారి అదే పోస్టు. నోస్టాల్జియాలో జీవిస్తున్నాడు. పాపం తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి పదేపదే ఈ విషయాలు జ్ణాపకం చేస్తుంటారు. దేశంలో ఓడిన, పదవిలో ఉన్న సీఎం లెవరూ ఇలా సొంత డబ్బా కొట్టుకోలేదు’అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.
‘గ్రామ వాలంటీర్ల నియామకంపై చంద్రబాబు మళ్లీ కడుపుమంట బయట పెట్టుకున్నాడు. నెలకు 200 కోట్లు ఖర్చు పెట్టి వలంటీర్లను నియమించడానికి ఎవడిచ్చాడు మీకు అధికారం అని గుడ్లురుముతున్నాడు. కొడుక్కి మాత్రమే ఉద్యోగం ఇచ్చి, ఐదు లక్షల కోట్లు దోచుకున్నోడు ఇంతకంటే ఏం మాట్లాడతాడు’అన్నారు.
‘విశాఖ పర్యటనలో చంద్రబాబును కార్యకర్తలెవరూ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే డబ్బులు వెదజల్లి కొంతమందిని పోగు చేశారు. ఎయిర్పోర్టుకు లచ్చల మంది కార్యకర్తలు రావడానికి సిద్ధమైతే పోలీసులు అడ్డగించారట. ఇలాంటి సిగ్గు లేని మాటలు నాలుగు నెలలుగా చెబుతూనే ఉన్నాడు’అంటూ చురకలంటించారు.
‘పోలవరం అంచనాలను 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచడంలో జరిగిన అవినీతిపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర జలవనరుల శాఖను విచారణకు ఆదేశించిన తర్వాత చంద్రబాబు స్వరం మారింది. నిరాశా నిస్పృహలు ఆవహించాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. అవే అబద్ధాలు. అదే సొల్లు’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.