యాప్నగరం

'పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి రావొద్దు'

'చంద్రబాబు స్క్రిప్ట్ తో వైజాగ్ షో పూర్తి అయిందనిపించాడు ప్యాకేజి స్టార్. రాజకీయాల్లో కాల్షీట్ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు'

Samayam Telugu 4 Nov 2019, 2:04 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్‌లో చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌‌సీపీ ఎదురు దాడికి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, పార్టీ నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది. పవన్ చంద్రబాబుకు దత్తపుత్రుడని.. టీడీపీ స్క్రిప్ట్‌నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారంటోంది. ఇటు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ మండిపడ్డారు.
Samayam Telugu babu


‘పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా కవరేజి బాధ్యత చూసుకోవాలి. కార్యకర్తలను తనే తరలించాలి. ప్రజలకు ఇద్దరి అనుబంధం తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక హడావుడి చేయాలి కాబట్టి దత్తపుత్రుడిని ముందుకు నెట్టాడు. లాంగ్ మార్చ్ కాస్త తుస్సుమంది’అన్నారు.
‘చంద్రబాబు స్క్రిప్ట్ తో వైజాగ్ షో పూర్తి అయిందనిపించాడు ప్యాకేజి స్టార్. రాజకీయాల్లో కాల్షీట్ సంస్కృతిని ప్రవేశపెట్టిన వ్యక్తులు నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తక్కువ చేసి చూడొద్దట. ఈ మాట ప్రజలను అడుగుతున్నావా?’అంటూ ప్రశ్నించారు.
‘ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. కన్న కొడుకులా అందరినీ కంటికి రెప్పలా చూసుకునే జగన్ గారు చాలు.పెద్ద కొడుకునని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు దగా చేసి లక్షల కోట్లు దోచుకెళ్లాడు.ఇప్పుడు దత్త పుత్రుడినొచ్చానంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారు’అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.