యాప్నగరం

నిజమే బాబు కావాలని వారు కోరుకుంటున్నారు: విజయసాయి

చంద్రబాబు మళ్లీ తనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు, కలవరిస్తున్నారు. అందుకే తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో 2.20లక్షలమంది ఓటర్లలో 1800 ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.

Samayam Telugu 26 Oct 2019, 10:47 am
కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు తనను కోరుకుంటున్నారని.. నాలుగు నెలల్లోనే జగన్ పాలనపై విసుగొచ్చిందని పరోక్షంగా చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయగా.. వైఎస్సార్‌సీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిరస్కరించినా మారలేదంటూ మండిపడ్డారు. జగన్ పాలనను చూసి ఓర్వలేక.. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సెటైర్లు పేల్చారు.
Samayam Telugu babu


Read Also: TDP ఎంపీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబుపై సెటైర్లు పేలుస్తూ ట్వీట్ చేశారు. అందులో ‘మళ్లీ తనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు గారు కలవరిస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమే. పోలైన ఓట్లలో ఒక శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు’అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
‘ఎయిర్ పోర్టులో చిరు తిండ్ల ఖర్చు 25 లక్షలు, ఒక్క రోజు ధర్నాకు 10 కోట్లు, టిటిడి నిధులు 5 కోట్లు, పోలవరం బస్సు యాత్రలకు 100 హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లు. హిమాలయన్ వాటర్. చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దది వస్తుంది. కొందరు పదవిలో ఉన్నది అనుభవించడానికే అనుకుంటారు చంద్రబాబు’ అన్నారు.
ఇటు ఎల్లో మీడియా పేరుతో మరో ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.