యాప్నగరం

'లోకేష్ దీక్ష చేసినా అలసట లేదే.. ముందే గట్టిగా తినొచ్చుంటాడు'

'చిరుతిండి లేకుండా నాలుగు గంటలు కూర్చున్న లోకేష్‌కి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి.. గట్టిగా తినొచ్చుంటాడు. ముఖంలో అలసట కూడా లేదు.. నిరాహార దీక్షలకు గౌరవం లేకుండా చేస్తున్నారు కదయ్యా తండ్రి, కొడుకులిద్దరూ' అంటూ విజయసాయి సెటైర్లు.

Samayam Telugu 31 Oct 2019, 2:22 pm
ఏపీలో ఇసుక కొరతపై రగడ కొనసాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బుధవారం దీక్ష కూడా చేశారు. జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఇసుక దొరక్క, పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాజాగా లోకేష్ దీక్షకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. లోకేష్ దీక్షపై ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు. అలాగే పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించబోతున్న లాంగ్ మార్చ్‌ను టార్గెట్ చేశారు.
Samayam Telugu ysrcp mp vijaya sai reddy satires on nara lokesh hunger strike
'లోకేష్ దీక్ష చేసినా అలసట లేదే.. ముందే గట్టిగా తినొచ్చుంటాడు'


విజయసాయి తన ట్వీట్‌లో ‘చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న మాలోకానికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి? పిచ్చి కాకపోతే. గట్టిగా తినొచ్చుంటాడు. ముఖంలో అలసట కూడా కనిపించడం లేదని వార్తలు చూసిన ప్రజలనుకుంటున్నారు. నిరాహార దీక్షలకు గౌరవం లేకుండా చేస్తున్నారు కదయ్యా తండ్రి, కొడుకులిద్దరూ’అంటూ ఎద్దేవా చేశారు.
‘టీడీపీ పడవ మునుగుతుందని తెలిసి ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకుంటుండంతో చంంద్రబాబు ప్యాకేజి స్టార్ ను రంగంలోకి దించాడు. ఇసుక దొరక్క ప్రజలు అన్న పానీయాలు మానేశారన్న రీతిలో పచ్చ మీడియా తీన్మార్ మొదలు పెట్టింది. దృష్టి మళ్లించేందుకు ఎన్ని డ్రామాలు ఆడినా పార్టీ కనుమరుగవడం ఖాయం’అన్నారు విజయసాయిరెడ్డి.
‘తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకుందంటే అక్కడ మీరు పాలన చేయలేదు కదా. మీరు సృష్టించిన ఇసుక మాఫియా పెడరెక్కలు విరిచి కట్టడానికి సిఎం జగన్ గారు కొత్త విధానం తీసుకొచ్చారు. దోపిడీ పాలన అంతమైందని తెలిసి ప్రకృతి కరుణించింది. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. తేడా అర్థమైంది కదా’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.