యాప్నగరం

'ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోయాడు'.. వైసీపీ ఎంపీ

వెట్టి చాకిరి నిర్మూలన చట్టం వచ్చినా ప్యాకేజీ స్టార్ బానిస సంకెళ్లను నుంచి బయటపడలేకపోతున్నారు. అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు లేదట.. కట్టప్పను మించిపోయారు.

Samayam Telugu 18 Feb 2020, 1:30 pm
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాల అంశాన్ని ప్రస్తావిస్తూ ఇద్దర్ని మరోసారి టార్గెట్ చేశారు. పచ్చ మీడియాతో కలిసి అబద్ధపు ప్రచారంతో తప్పుదారి పట్టిస్తున్నారని.. పవన్ కళ్యాణ్ ఐటీ దాడులపై స్పందించకపోవడంపై సెటైర్లు పేల్చారు విజయసాయి.
Samayam Telugu pawan


వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేక పోతున్నారు అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నారు.. పీఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదు.. కట్టప్పను మించి పోయారు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేశారు.
చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోందన్నారు విజయసాయిరెడ్డి. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయిందని.. రూ.2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది అని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.