యాప్నగరం

'ఆ అవమానాన్ని 3 నెలలకే మర్చిపోతే ఎలా లోకేష్ బాబూ..'

'ఐదేళ్ల పాలనలో అడ్డూ అదుపు లేకుండా దోచుకున్నవారికి ఏది చూసినా స్కామ్‌లాగే కనిపిస్తుంది. టీడీపీ బందిపోట్ల నేరాలు రుజువైతే జైళ్లు మొత్తం నిండిపోతాయేమో '

Samayam Telugu 13 Aug 2019, 5:43 pm
టీడీపీపై ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత సర్కార్ పాలన, నిర్ణయాలపై విరుచుపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తనయుడు నారా లోకేష్‌లు టార్గెట్‌గా ట్విట్టర్‌లో ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి లోకేష్‌‌పై మండిపడ్డారు. వైసీపీ సుపరిపాలన అందిస్తుంటే.. లోకేష్‌కు మాత్రం అంతా స్కామ్‌లాగే కనిపిస్తోందంటూ మండిపడ్డారు.
Samayam Telugu lokesh


‘మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా?’అంటూ చురకలటించారు.
‘వయసుకు తగిన మానసిక పరిణితి లేని లోకేశ్‌ కంటికి ప్రతిదీ స్కామ్‌ లాగానే కనబడుతుంది. ఐదేళ్లు అడ్డూ అదుపు లేకుండా దోచుకున్న వాళ్లకి ఎదుటి వారి మీద బురద చల్లడం తప్ప ఇంకేం తెలుస్తుంది. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే హర్షించ లేని కుటిల మనస్తత్వం వీరిది’అంటూ మండిపడ్డారు.
‘మోదీని గద్దె దింపేంత వరకు నిద్ర పోయేది లేదని దేశమంతా తిరిగి అందరినీ ఆగం పట్టించిన చంద్రబాబు కోసం ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే దొరకడం లేదట. అందరినీ రెచ్చగొట్టి తను మాత్రం 370 రద్దుకు మద్ధతు ఇవ్వడంపై నిలదీయాలనుకుంటున్నారట’ఆర్టికల్ 370 రద్దు విషయంలో చంద్రబాబును టార్గెట్ చేశారు.
‘పిల్లల మధ్యాహ్న భోజనం, బాలికల సైకిళ్లు, చివరకు స్కూల్‌ విద్యార్థులకు ఇచ్చే బూట్లలో కూడా తెలుగు దొంగల పార్టీ నేతలు కమిషన్లు దండుకున్నారు. బాబు గారి పాలనలో బందిపోట్ల దోపిడీ లేని పథకమే లేదు. వీళ్లందరి నేరాలు రుజువైతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవేమో?’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.