యాప్నగరం

'చంద్రబాబు పంపిన డబ్బు రూ.800 కోట్లు పైనే.. ఆ గుట్టంతా త్వరలో బయటకొస్తుంది'

చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. లెక్కలతో సహా ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.. లెక్క రూ.800కోట్లకుపైగా ఉందంటున్న ఎంపీ.

Samayam Telugu 21 Feb 2020, 12:02 pm
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లను ట్విట్టర్‌లో టార్గెట్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నారావారి ఫ్యామిలీ ప్రకటించిన ఆస్తులపై సెటైర్లు పేల్చారు. తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతారు అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది.. అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ అన్నారు.
Samayam Telugu visa

అహ్మద్ పటేల్‌కు పంపిన రూ.400 కోట్లే కాదు.. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చారన్నారు విజయసాయి. తెలంగాణా ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చుపెట్టారని.. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగిందని.. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశారు అంటూ పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ చేశారు.
అంకతముందు ట్వీట్‌లలో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. వారు ప్రకటించిన ఆస్తులు రోటీన్ డ్రామానే... వారు ప్రకటించనవి, బినామీ ఆస్తులు, సీక్రెట్ బ్యాంక్ అకౌంట్స్‌ వివరాలు మాత్రం ప్రకటించరన్నారు. చంద్రబాబు బినామీ ఆస్తులపై, ఆక్రమించిన భూములు, ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. స్విస్ బ్యాంక్ అకౌంట్లు, బినామీలపై విచారణకు రెడీనా అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.