యాప్నగరం

బాబు హైదరాబాద్‌ పారిపోయి 50 రోజులవుతోంది.. ప్రశ్నించరా: వైసీపీ ఎంపీ సెటైర్లు

చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తైంది. కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండటమేమిటని ప్రశ్నించారు. శ్రీశైలం నీళ్లపై మౌనీ బాబా నోరు విప్పాలన్న ఎంపీ.

Samayam Telugu 16 May 2020, 12:44 pm
టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. శ్రీశైలం నుంచి నీళ్ల తరలింపు, అమరావతి రైతుల ఉద్యమం విషయంలో బాబు తీరుపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. నలుగురు కూర్చుని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తున్నారంటూ ఫైరయ్యారు.
Samayam Telugu చంద్రబాబు


ఇతర పార్టీల్లోకి తను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జీవోపై ఉసిగొల్పుతున్నారు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుందని.. ఏపీ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని సీఎం జగన్ గారు స్పష్టం చేశారన్నారు. మౌనీ బాబా నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండటమేమిటని ఎల్లో మీడియా ప్రశ్నించదని.. నలుగురు కూర్చుని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తోంది అన్నారు. అమరావతిలో రైతులు ఉద్యమంపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.