యాప్నగరం

దేవుడి దయతో కరోనా నుంచి కోలుకున్నా.. విజయసాయి ట్వీట్

చికిత్స తర్వాత నెగటివ్‌ రావడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జ్‌ చేసినట్లు సమాచారం. మరికొన్ని రోజులు విశ్రాంతిలో భాగంగా ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారట. ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ఆశించిన ప్రతీఒక్కరికీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

Samayam Telugu 1 Aug 2020, 12:38 pm
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకిన వెంటనే ఎంపీ హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌తో వారం క్రితం విజయసాయి అపోలోలో చేరారట. చికిత్స తర్వాత నెగటివ్‌ రావడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జ్‌ చేసినట్లు సమాచారం. మరికొన్ని రోజులు విశ్రాంతిలో భాగంగా ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారట. ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ఆశించిన ప్రతీఒక్కరికీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను అన్నారు. ఆయన కోలుకోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.