యాప్నగరం

PMOలో విజయసాయి, అజేయ కల్లం.. ఆశీస్సులు కాదు అక్షింతలు!?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పీఎంవో ఆఫీసుకు వెళ్లారు. అజేయ కల్లంతో కలిసి ఆయన పీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వీరిద్దరూ పీఎంవో అధికారులకు వివరించారు.

Samayam Telugu 23 Aug 2019, 5:24 pm
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం శుక్రవారం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. పీపీఏలను సమీక్షించడం, పోలవరం రివర్స్ టెండరింగ్ లాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తమకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని విజయ సాయి రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయన పీఎంవోకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీఏల రివ్యూపై అజేయ కల్లం పీఎంవోకు సమగ్ర నివేదికను అందించారని తెలుస్తోంది.
Samayam Telugu Vijaya sai Reddy Facebook


ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రాను విజయసాయి, అజేయ కల్లం కలిశారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వారిద్దరూ ప్రధాని కార్యాలయ అధికారులకు వివరించారు. పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండరింగ్ లాంటి నిర్ణయాల్లో తమకు ప్రధాని, హోం మంత్రి ఆశీస్సులు ఉన్నాయన్న విజయసాయి వ్యాఖ్యల పట్ల ప్రధాని కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాగా అంతకు ముందు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలకు కేంద్రాన్ని నిందించేలా విజయసాయి వ్యవహరిస్తున్నారని కమలనాథులు మండిపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. పీఏంవో నుంచి వారికి పిలుపొచ్చిందని సమాచారం.

Read Also: నా సవాల్‌కు సిద్ధమా?: విజయసాయికి కేశినేని ఛాలెంజ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.