యాప్నగరం

విజయసాయిరెడ్డి ఆరోగ్యంపై వదంతులు, క్లారిటీ ఇచ్చిన ఎంపీ.. అసలేం జరిగిందంటే!

తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Samayam Telugu 28 Mar 2021, 3:02 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోగ్యంపై వదంతులు గుప్పుమన్నాయి. దీంతో శనివారం సాయంత్రం విజయసాయి తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు. తాను కోవిడ్‌ బారిన పడినట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు. శుక్రవారం తాను చేయించుకున్న కోవిడ్‌ టెస్ట్‌ (ఆర్టీపీసీఆర్‌)లో భగవంతుని ఆశీర్వాదంతో నెగిటివ్‌ వచ్చిందని వివరించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


‘‘భగవంతుని ఆశీర్వాదంతో శుక్రవారం మార్చి 26న కోవిడ్ టెస్ట్ (ఆర్టీపీసీఆర్) నెగిటివ్ వచ్చింది. నాకు కోవిడ్ పాజిటివ్ అని మిత్రులు, శ్రేయోభిలాషులు పరామర్శగా ఫోన్ కాల్స్ చేస్తున్న నేపథ్యంలో వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి. భగవంతని దయవల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. అన్ని పారామీటర్స్ బాగున్నాయి.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.