యాప్నగరం

విశాఖ వాసులకు అలెర్ట్ : విజయసాయి కీలక ప్రకటన.. రేట్లు పెరుగుతాయ్.!

విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమని.. త్వరలోనే తేదీ ప్రకటిస్తామని విజయసాయి రెడ్డి కుండబద్దలు కొట్టారు. నగర వాసులకు పన్నుల పెంపుపై కీలక ప్రకటన చేశారు.

Samayam Telugu 17 Jun 2021, 7:50 pm
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖలో ఏర్పాటు చేయడం ఖాయమని వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని తరలింపునకు ఇంకా ముహూర్తం ఖరారు చేయలేదని.. చేసిన వెంటనే తెలియజేస్తామని ఆయన అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నగర వాసులకు ఇంటి పన్నుల గురించి కీలక ప్రకటన చేశారు. నగరంలో భూమి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచనున్నట్లు చెప్పారు. నగరంలో 3 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు విజయసాయి తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vijayasai


రాష్ట్ర ప్రభుత్వం భూములు తాకట్టు పెడుతోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు విజయసాయి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదేమీ కొత్త పద్ధతి కాదని.. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే సమయంలో ఆస్తులు ష్యూరిటీ చూపించడం సాధారణమైన విషయమేనని ఆయన తేల్చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయసాయి రెడ్డి అన్నారు. నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.