యాప్నగరం

శునకాన్ని కనకపు సింహాసనం ఎక్కించారు.. ఎస్ఈసీ రమేష్‌పై వైసీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Nimmagadda Ramesh Kumar: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కుమ్మక్కై ఆయన ఎన్నికలను వాయిదా వేశారని చెప్పారు.

Samayam Telugu 15 Mar 2020, 9:40 pm
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్‌ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక శునకాన్ని కనకపు సింహాసనంపై కూర్చోపెడితే ఏం చేస్తుందో అదే పని నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్‌గా చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మెదడు మొత్తం కలుషితమై పోయిందని దుయ్యబట్టారు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు.
Samayam Telugu ramesh


Also Read: సీఎం జగన్ మా మాటలు పట్టించుకోలేదు, అందుకే ఇలా.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు ఆదివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌పై తమకు గౌరవం ఉందని, అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదో లేదో ప్రజలే తేలుస్తారని అన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికి రమేష్ రాజ్యాంగ విలువలను కాలరాశారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత సెక్రటరీలను సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని, పోలీసులను, అధికారులను ఎవరినీ సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకున్నారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌కు కనీస నైతికత విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: నేను కోరిన వెంటనే ఎన్నికలు వాయిదా.. టీడీపీ కీలక నేత సంచలనం
నిమ్మగడ్డ రమేష్‌ ఒక శాడిస్టుగా వ్యవహరించారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన్ను నిమ్మగడ్డ రమేష్ అని పిలవడం కన్నా.. నారావారి గబ్బిలం అని పిలిస్తే బాగుంటుందన్నారు. ఆర్టికల్‌ 243కే ప్రకారం విపత్తుల సమయంలో మాత్రమే ఎన్నికలు వాయిదా వేయాలని, కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేదని చెప్పారు. అయితే తెలుగు దేశం పార్టీని రక్షించడానికే నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను వాయిదా వేశారని వ్యాఖ్యానించారు.

Also Read: సీఎం వ్యాఖ్యలు బాధాకరం, ఎన్నికల వాయిదాకు కారణమిదే.. ఎస్‌ఈసీ రమేష్ వివరణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.