సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేసిన మాజీ మంత్రి యనమలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారంటూ యనమల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన మీరా మాట్లాడేది అంటూ విమర్శించారు. జగన్ ఏ విధంగా రాష్ట్రాభివృద్ధిని గండికొట్టారంటూ నిలదీశారు. Also Read : ‘చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు.. బాలయ్య అల్లుడికి భూ నజరానా’
పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్తో దోస్తీపైనా యనమల చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చారు. తెలంగాణకు లబ్ధి కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ యనమల చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు అంత అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. అర్థంలేని విమర్శలు చేస్తూ ఎందుకు చులకన అవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్, బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారంటూ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేశారని విజయసాయి అన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని అప్పడే మరచిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. తప్పడు ప్రచారంతో బురదజల్లేందుకు ప్రయత్నించినందుకు ప్రజలు తపుక్కున ఉమ్మిన సంగతి మర్చిపోవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన మీరా మాట్లాడేది అంటూ విమర్శించారు. జగన్ ఏ విధంగా రాష్ట్రాభివృద్ధిని గండికొట్టారంటూ నిలదీశారు.
పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్తో దోస్తీపైనా యనమల చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చారు. తెలంగాణకు లబ్ధి కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ యనమల చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు అంత అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. అర్థంలేని విమర్శలు చేస్తూ ఎందుకు చులకన అవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్, బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారంటూ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేశారని విజయసాయి అన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని అప్పడే మరచిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. తప్పడు ప్రచారంతో బురదజల్లేందుకు ప్రయత్నించినందుకు ప్రజలు తపుక్కున ఉమ్మిన సంగతి మర్చిపోవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.