యాప్నగరం

‘ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం.. ఆఫ్రికా నుంచి మిడతల దండు’

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 7 Feb 2020, 10:59 pm
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu babu, sai


Also Read: నీ తలపై జుట్టు లేదు.. ఎంపీ గల్లాపై మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కియా మోటార్స్ వ్యవహారంపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్లు చేశారు. చంద్రబాబు ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తారని, అన్నింటికి తెగబడి పోయారని వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించారని పేర్కొన్నారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

Also Read: కియా మోటర్స్ తరలింపుపై ఎండీ సంచలన ప్రకటన

అలాగే చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోంది. నదులన్నీ వెనక్కి ప్రవహస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్లు నాసా హెచ్చరించింది లాంటి వార్తలు కూడా త్వరలో వస్తాయి. చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్.’’ అని మండిపడ్డారు.

Also Read: Corona Effect: కర్నూలు యువతి మరో వీడియో.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.