యాప్నగరం

ఏపీలో కియా రూ. 400 కోట్ల అదనపు పెట్టుబడి, ఇప్పుడేమంటారు: వైసీపీ ఎంపీ

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ కియా అదనపు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిందని తెలిపారు.

Samayam Telugu 1 Jun 2020, 1:12 pm
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు సంధించారు. ఈ మేరకు సోమవారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. ‘‘పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని చంద్రబాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు’’ అని వ్యాఖ్యానించారు.
Samayam Telugu కియా పరిశ్రమ, సీఎం జగన్


‘‘కియా పరిశ్రమ తరలిపోతోందని గుండెలు బాదుకునోళ్లు ఇప్పుడు సిగ్గుతో బిగుసుకుపోయారు. అప్పట్లో సంస్థ ప్రతినిధులు ఖండించినా ఎల్లో మీడియా బోగస్ వార్తల దాడి కొనసాగించింది. సీఎం జగన్ గారి సమక్షంలో కియా రూ. 400 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించేటప్పటికి నోళ్లు పెగలడం లేదు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

కాగా మరో ట్వీట్‌లో.. ‘‘నిన్న యనమల స్టేట్‌మెంట్‌తో ఒక విషయం వందో సారి స్పష్టమైంది. టీడీపీకి ప్రజాస్వామ్యం, ప్రజల మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే’’ అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.