యాప్నగరం

విశాఖకు త్వరలో పరిపాలనా రాజధాని.. వైసీపీ కీలక నేత ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖపట్నంకు త్వరలోనే పరిపాలనా రాజధాని రాబోతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈసారి మేయర్ పీఠాన్ని వైసీపీనే కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Samayam Telugu 8 Mar 2020, 8:28 pm
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విధంగా త్వరలోనే విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని రాబోతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్లడించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతున్న తరుణంలో మేయర్‌ పీఠాన్ని కచ్చితంగా వైఎస్సార్‌సీపీ గెలవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఆదివారం విశాఖలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో విజయసాయిరెడ్డి ప్రసంగించారు.
Samayam Telugu pjimage (80)


Also Read: బీసీలకు సీఎం జగన్ వరం.. టీడీపీకి దిమ్మతిరిగేలా..

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న వైసీపీకే ప్రజలను ఓటు అడిగే హక్కుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చట్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. పార్టీ నిర్ణయానికి లోబడి పనిచేసే వ్యక్తులకు మాత్రమే సీట్లు కేటాయిస్తాని తెలిపారు.

Also Read: చంద్రబాబు సంచలన నిర్ణయం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఇక తాడోపేడో

అలాగే అభ్యర్థుల గెలుపు బాధ్యత పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలదే అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎదుగుదల కోసం పనిచేసే నాయకులకు సీఎం జగన్‌ ఖచ్చితంగా న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకుండా ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు టీడీపీని ఓడించాలన్నారు.

Also Read: మండపేట గ్యాంగ్ రేప్‌పై పవన్ కళ్యాణ్ స్పందన.. జనసైనికులకు కీలక సూచనలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.