యాప్నగరం

త్వరలో మీ రాజకీయ జీవితాలు క్లోజ్.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నాయకుల రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయని వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మూడు రాజధానుల వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Samayam Telugu 4 Feb 2020, 5:08 pm
టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ నేతపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూడు రాజధానుల వ్యవహారంపై హాట్ కామెంట్లు చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో వీరంతా జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించారు. ఆ ఉక్రోషంతోనే పిచ్చి కూతలు కూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Samayam Telugu babu, sai


‘‘మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల్లో ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి.’’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే విజయసాయిరెడ్డి చంద్రబాబును, టీడీపీని లక్ష్యంగా చేసుకుని తరచూ ట్వీట్లు చేస్తుంటారు. చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తుంటారు. ఇందులో భాగంగానే మరోసారి ఫైరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.