యాప్నగరం

పిచ్చి సలహాలివ్వొద్దు, దాన్నొక బెంచ్ మార్క్‌లా భ్రమపడొద్దు.. అధికారులు అప్పట్లో.. విజయసాయి సంచలనం!

TDP: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 29 Aug 2021, 10:53 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రివ్యూలంటేనే అధికారులు జడుసుకునేవారని వ్యాఖ్యానించారు. బాబు హయాంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు లేకుండా సమీక్షలు జరిగేవి కావన్నారు. పరిపాలన ఎలా చేయాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ ఉందని.. పిచ్చి సలహాలివ్వొద్దని సంచలన వార్నింగ్ ఇచ్చారు.
Samayam Telugu సీఎం జగన్‌తో విజయసాయిరెడ్డి (ఫైల్)


అలాగే, చంద్రబాబు మొదటి 6 నెలల్లోనే 800 జీఓలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టకుండా గోప్యత పాటించారని.. ఆ విషయం మర్చిపోయినట్టున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అవసరముంటేనే జీఓలను పబ్లిక్ డొమైన్‌లో పెడతారని.. కానీ, దివాలాకోరు పచ్చ పార్టీ వీటినీ వివాదం చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.


‘‘పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు లేకుండా సమీక్షలు జరిగేవి కావు బాబు హయాంలో. రివ్యూలంటేనే అధికారులు జడుసుకునేవారు. ఎల్లో మీడియా దాన్నొక బెంచ్ మార్క్ లా భ్రమపడి, PPTలు లేకుండా సమీక్షలేంటని పొర్లి పొర్లి ఏడుస్తోంది. ఏదెలా చేయాలో జగన్ గారికి క్లారిటీ ఉంది. పిచ్చి సలహాలివ్వొద్దు.

చంద్రబాబు మొదటి 6 నెలల్లోనే 800 జీఓలను ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టకుండా గోప్యత పాటించాడు. ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. జీఓలు శాఖాధిపతులకు ఇచ్చే అధికారిక ఆదేశాలు. అవసరముంటే వాటిని పబ్లిక్ డొమైన్ లో పెడతారు. దివాలాకోరు పచ్చ పార్టీ వీటినీ వివాదం చేయాలనుకుంటోంది.’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.