యాప్నగరం

కోడెల మృతి: ‘చంద్రబాబు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అదుర్స్’

కోడెల బతికి ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీ నేతలతో తిట్టించి తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. చనిపోయిన తరువాత అంతిమయాత్రలో పాల్గొని ఎల్లో మీడియా సాయంతో సానుభూతి పొందే ప్రయత్నం చేశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Samayam Telugu 21 Sep 2019, 12:47 pm
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ శవయాత్రని రాజకీయాలకు చాలా చక్కగా వినియోగించుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ మీడియాలో కనపడుతూ చక్కని ప్రదర్శన చేశారంటూ ఎద్దేవా చేశారు. పార్టీ నేతలతో తిట్టించి కోడెలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని, చనిపోయిన తరువాత అంతిమయాత్రలో పాల్గొని ఎల్లో మీడియా సాయంతో సానుభూతి పొందే ప్రయత్నం చేశారంటూ విమర్శలు గుప్పించారు.
Samayam Telugu cbn


Must Read: కోడెలను కొడుకే చంపాడు! హైకోర్టులో పిటిషన్

పార్టీ సీనియర్ నేత కోడెలపైకి వర్ల రామయ్య లాంటి నేతలను ఉసిగొల్పారని విమర్శించారు. పల్నాటి పులి కోడెల అంటూనే తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని విజయసాయి ఆరోపించారు. ఎల్లో మీడియా సాయంతో అంతిమయాత్ర కోడెల అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ తన ఈవెంట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ని అద్భుతంగా ప్రదర్శించారంటూ సెటైర్లు పేల్చారు.

Also Read: కోడెల మృతి: సాక్షి, విజయసాయిపై కేసులు! టీడీపీ నిర్ణయం?

కోడెల ఆత్మహత్య విషయం తెలుసుకున్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి కోడెల భౌతిక కాయంతో కాన్వాయ్‌గా బయలుదేరి విజయవాడ మీదుగా గుంటూరు చేరుకున్నారు. మరుసటి రోజు నరసరావుపేటలో జరిగిన కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు పాల్గొని అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకూ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.