యాప్నగరం

బాబు కోసం ఎంత నీచానికైనా..! ‘ఎల్లో మీడియా’పై విజయసాయి ఫైర్

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ భేటీపై ఎల్లో మీడియా విషం కక్కిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరు సీఎంలు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు ప్రచురించాయని ఆరోపించారు.

Samayam Telugu 25 Sep 2019, 11:05 am
ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీపై ఎల్లో మీడియా విషం కక్కిందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సహృదయంతో ఇద్దరు సీఎంలు కలిసి చర్చలు జరిపితే ఎల్లో మీడియా అసత్య కథనాలను ప్రచురించిందని విజయసాయి ఆరోపించారు. గోదావరి నదీ జలాల వినియోగం, విభజన సమస్యల పరిష్కారంపై సీఎంలు చర్చలు జరిపారన్నారు.
Samayam Telugu babu.


Must Read:‘ఈనాడు’పై సీఎంవో సీరియస్.. విషయమేంటంటే?

కేంద్రంపై ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేశాయని విజయసాయి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా కథనాలు వండివార్చి తమ క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఎంత నీచానికైనా దిగజారతారంటూ ఘాటు విమర్శలు చేశారు.



మరోవైపు ఏపీ సీఎంవో కూడా ఈనాడు రాసిన కథనాన్ని తప్పుబట్టింది. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్నట్లు కథనాలు ప్రచురించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కథనాలు ప్రచురించినట్లు భావిస్తున్నామని, ఈనాడు ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండించింది.

రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం తదితర అంశాలపై మాత్రమే సీఎంలు జగన్, కేసీఆర్ చర్చించినట్లు సీఎంవో పేర్కొంది. అలాగే తెలంగాణ పోలీసు కానిస్టేబుళ్లకు ఆంధ్రాలో శిక్షణ, విభజన సమస్యలు, విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై చర్చించినట్లు తెలిపింది. రాజకీయ అంశాలు ఈ భేటీలో చర్చకు రాలేదని సీఎంవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.