ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సొంత పార్టీ నేతలపై తరుచూ విమర్శలు గుప్పిస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీకి కంటిలో నలుసు మాదిరిగా మారారు. అవినీతి ఆరోపణల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, ఆగస్టు 25న ఏదో జరుగబోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజుపై విజయసాయి రెడ్డి పరోక్షంగా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బ్యాంకులను నిండా ముంచాడని, ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదని విజయసాయి ట్వీట్ చేశారు. తాడు బొంగరం లేదని, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూరో బేరగాడు యూరప్కే పోతాడా? నియోజకవర్గంకి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెప్తారని అన్నారు. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామ రామ అంటూ ట్వీట్ చేశారు.
‘తాడు బొంగరం లేదు.. తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు. బ్యాంక్స్ని నిండా ముంచి ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదు.. యూరో బేరగాడు యూరప్కే పోతాడా? నియోజకవర్గానికి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెప్తారు.. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామ రామ’ అంటూ ట్విట్టర్లో విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. పేరు ప్రస్తావించకపోయినా రఘురామను ఉద్దేశించే ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే, తమ పార్టీ అధ్యక్షుడిపై ఆరోపణలు వచ్చాయనేది ఆవేదన.. ఆయన రెండేళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదు.. సుప్రీం కోర్టు కూడా కేసుల్ని ఏడాదిలో తేల్చాలంటోందని ఇటీవల ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు బయటకు రావాలంటే.. ముఖ్యమంత్రి పదవి అడ్డుగా ఉందని.. అందుకే కోర్టుకు వెళ్లలేకపోతున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉండరు.. ఒక నెల రోజులు కోర్టుకు వెళితే ఆయన క్లీన్గా బయటకు వస్తారు.. మళ్లీ ముఖ్యమంత్రి అవ్వొచ్చు అన్నారు.
‘తాడు బొంగరం లేదు.. తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు. బ్యాంక్స్ని నిండా ముంచి ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదు.. యూరో బేరగాడు యూరప్కే పోతాడా? నియోజకవర్గానికి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెప్తారు.. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామ రామ’ అంటూ ట్విట్టర్లో విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. పేరు ప్రస్తావించకపోయినా రఘురామను ఉద్దేశించే ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.