యాప్నగరం

చంద్రబాబును ఎవరూ ఏమీ అనొద్దు: విజయసాయిరెడ్డి

Chandrababu Naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 18 Oct 2020, 4:29 pm
అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధినేత, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడుపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు స్క్రిజోఫీనియా ముదిరిపోయిందని వ్యాఖ్యానించారు. అల్జీమర్స్ ఆఖరి దశలోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. ‘‘చంద్రబాబుకి స్క్రిజోఫీనియా ముదిరిపోయింది. అల్జీమర్స్ ఫైనల్ స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. తనని తాను పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు తాను జడ్జి పాత్రలో ఊహించుకుంటున్నాడు. ఆ క్యారెక్టర్‌లో తీర్పు కూడా ఇచ్చాడు. పాపం.. ఎవ్వరు ఏం అనొద్దు.’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి, చంద్రబాబు

అలాగే రాష్ట్రంలో మహిలలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయగా, ఆయనపై విజయసాయి ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. ‘‘మహిళల భద్రత గురించి బాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. తాహసీల్దార్ వనజాక్షి గారిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పని రౌడీని వెనకేసుకొచ్చిందెవరు? బిటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసినవారిని కాపాడింది మీరు కాదా?’’ అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.