యాప్నగరం

ఇసుకను ‘ప్యాకేజీ’ల్లో విక్రయించరు.. పవన్‌కు విజయసాయి చురకలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇసుకను ప్యాకేజీల్లో విక్రయించరంటూ ఎద్దేవా చేశారు. ఇసుక విధానం మీద ఏదైనా మాట్లాడాలంటే ఇసుక కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

Samayam Telugu 15 Sep 2019, 10:55 am
వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. జగన్ పాలన అద్భుతమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో టీడీపీ, జనసేన ముందున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పాలనపై నివేదిక ఇచ్చారు. అంతకు ముందే ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నవులూరులో ఉన్న ప్రభుత్వ ఇసుక స్టాక్ యార్డ్‌‌ను పరిశీలించారు. టన్ను రూ. 375 అని చెప్పి రూ.900 చొప్పున అమ్ముతున్నారని విమర్శించారు.
Samayam Telugu vijayasai reddy


జగన్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్‌ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా అంటూ.. పవన్‌పై సెటైర్లు వేశారు.

ఇసుకను కిలో, పది కిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా చెప్పండంటూ జనసేనానికి చురకలు అంటించారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుందని ఎద్దేవా చేశారు. మంగళగిరి సమీపంలో పవన్ కళ్యాణ్ కట్టుకున్న ఇంటికి టీడీపీ నేతలే ఇసుక సరఫరా చేశారనే అర్థం వచ్చేలా విజయసాయి ట్వీట్ చేశారు.

వైఎస్ఆర్సీపీ 100 రోజుల పాలనలో పారదర్శకత లోపించిందని జనసేనాని ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ పాలన జనవిరుద్ధంగా ఉందంటూ పవన్ విమర్శలు గుప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.