యాప్నగరం

అనుభవం, ఆవకాయలు.. చంద్రబాబుపై విజయసాయి ట్వీట్ల తూటాలు

TDP అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. అనుభవం, ఆవకాయలని రాష్ట్రాన్ని దివాళా తీయించారని ట్వీట్ల తూటాలు పేల్చారు. మాజీ మంత్రి యనమలను సైతం ఆయన వదల్లేదు.

Samayam Telugu 7 Aug 2019, 3:19 pm
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. మన అదృష్టం బాగుండి ఇప్పుడు అధికారంలో లేరు గానీ, ఆర్టికల్ 370 తొలగించాక కశ్మీర్లో పెట్టుబడులు పెట్టేవారందరికీ తానే సంధానకర్తనని బాబు ప్రకటించకునే వారంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగులో తలపండిన వ్యక్తి కదా అమరావతిలో ‘గాయపడిన’ వారినందరిని ప్రత్యేక విమానాల్లో శ్రీనగర్ తరలించేవారంటూ చురకలు అంటించారు. ఏఎన్ఎం ఉద్యోగుల సమస్యలకు కూడా చంద్రబాబే కారణమని ఆయన ఎద్దేవా చేశారు.
Samayam Telugu babu tdp


‘‘అనుభవం, ఆవకాయలని రాష్ట్రాన్నిదివాలా తీయించారు. అలవి కాని హామీలిచ్చేసి ఇప్పుడు అవి నేరవేర్చడం జగన్ గారి బాధ్యతే అంటే ఎలా చంద్రబాబు గారూ? అయినా రుణ మాఫీ పూర్తిగా చేశామని ఎల్లో మీడియాలో రాయించుకున్నారు గదా?’’ అంటూ రుణమాఫీ చివరి దశ చెల్లింపులపై చంద్రబాబుకు చురకలు అంటించారు.

ప్రాజెక్టుల టెండర్లపై విచారణ జరిగితే అభివృద్ధి ఆగిపోతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విజయసాయి ‘సైరా’ పంచ్‌లేశారు. అభివృద్ధి ఆగిపోతుందా? లేదా నీ అవినీతి బయటపడుతుందనా? అని ఆయన ప్రశ్నించారు.
‘‘యనమల గారికి ఇప్పుడు స్వేచ్ఛ దొరినట్టుంది. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలన్నా కుటుంబరావు అనుమతి కావాల్సి వచ్చేదని చెబుతారు. ఇన్నాళ్లకి అదో-ఇదో అనే ఛాన్స్ దొరికింది. బాబు ప్రభుత్వంలో తన వియ్యంకుడు చేసిన కాంట్రాక్టులపై విచారణ కోరుతూ లేఖ రాసి తర్వాతే విమర్శలు చేయాలి’’ అని మాజీ ఆర్థిక మంత్రిని డిమాండ్ చేశారు. యనమల వియ్యంకుడు కూడా పోలవరం కాంట్రాక్టర్‌గా వ్యవహరించారని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.